పంజాబ్తో ముంబై ఉత్కంఠ పోరు.. రోహిత్ శర్మ ఆడేది డౌటే!
MI vs PBKS Clash: నేడు ( 2026, ఏప్రిల్ 16న) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఇరు జట్లు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రస్తుత ఎడిషన్లో ముంబై (MI) తీవ్రంగా కష్టపడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ (PBKS) అద్భుతమైన గెలుపులని నమోదు చేసుకున్నాయి. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు విజయాలతో, కోల్కతా నైట్ రైడర్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది.