సింగపూర్ నుంచి వచ్చిన 70 డ్రోన్లు సీజ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.సింగపూర్ నుంచి తీసుకొస్తున్న 70 డ్రోన్లను సీజ్ చేశారు. డ్రోన్లను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో డ్రోన్లను సింగపూర్ నుంచి తీసుకురావడం వెనక కారణం ఏంటనే కోణంలో విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
శనివారం (మార్చి 14) శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింగపూర్ నుంచి ముగ్గురు ప్రయాణికులు తీసుకొచ్చిన 70 డ్రోన్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు విమానాల్లో ఈ డ్రోన్లను సింగపూర్ నుంచి శంషాబాద్ కు తీసుకువచ్చారు. పట్టుకున్న డ్రోన్ల విలువ దాదాపు రూ.50లక్షల ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరోవైపు పశ్చిమాసియా దేశాల్లో ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయా దేశాలకు వెళ్లాల్సిన పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. శనివారం మొత్తం 13 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశారు.