'రెండో ఛాన్స్ ఉండదు'.. టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు గట్టి హెచ్చరిక
అమరావతి: మే డే (మే దినోత్సవం), 'పేదల సేవలో' కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా పామిడిముక్కలలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, తన ప్రభుత్వంలో కేవలం పనితీరు (Performance) ఆధారంగానే నాయకులకు గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పునరాభివృద్ధి దశను చూస్తోందని నొక్కిచెబుతూ, రాష్ట్ర భవిష్యత్తు దృఢమైన నాయకత్వం, నిరంతర అభివృద్ధిపై ఆధారపడి ఉన్నందున విధ్వంసక శక్తులను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.