తెలంగాణ ప్రజలను అవమానించేలా ..బీజేపీ నేతల వ్యాఖ్యలు
గ్రేటర్ వరంగల్, వెలుగు: తెలంగాణ ప్రజలను అవమానించేలా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చడం అత్యంత దుర్మార్గమన్నారు.