తెలంగాణ సర్కారీ బడుల్లో 'AI' పాఠాలు..20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి!
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కృత్రిమ మేధ (AI) పాఠాలను బోధించే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర విద్యాశాఖ 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్', 'పై జామ్ ఫౌండేషన్' భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) మరియు ఇతర ప్రభుత్వ పాఠశాలలకు 2,000 ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఏటా 20 నుంచి 25 గంటల పాటు ఏఐ ప్రాథమిక అంశాలు, డేటా వినియోగం వంటి విషయాలను అభ్యసిస్తారు.