Select Location
All Locations
State
Region
City / District
బీసీసీఐ సహకారం కోరాం: బంగ్లా క్రికెట్‌ బోర్డు డైరెక్టర్

బీసీసీఐ సహకారం కోరాం: బంగ్లా క్రికెట్‌ బోర్డు డైరెక్టర్

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్ బోర్డు సహకారం కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈమేరకు బీసీసీఐకి లేఖ ద్వారా తమ ఆసక్తిని తెలియజేసింది. మొన్నటివరకూ ఇరుదేశాల మధ్య రాజకీయ వైరుధ్యంతో గత టీ20 ప్రపంచకప్‌లోనూ బంగ్లా ఆడని సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లోనూ ఆ జట్టు ప్లేయర్లను ఫ్రాంచైజీలు తప్పించాయి. ఈ క్రమంలో మళ్లీ బీసీసీఐ సహకారం కోరుతూ బీసీబీ లేఖ రాయడం గమనార్హం. తాజాగా ఆ వివరాలను బంగ్లా బోర్డు డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ వెల్లడించారు. రెండో తప్పిదం.. 

శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ జరిమానా ‘‘మేం బీసీసీఐకి రాసిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించాం. సెప్టెంబర్‌లో టీమ్‌ఇండియా మా దేశంలో పర్యటించమని కోరాం. ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం భారత్‌కు మా టీమ్‌ వెళ్లాల్సిఉంది. బంగ్లాకు సహకారం అందించే అవకాశాలను పరిశీలించమని విజ్ఞప్తి చేశాం’’ అని అబేదిన్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక ఇరుదేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగవుతున్నాయి. ఏప్రిల్ 7, 8 తేదీల్లో బంగ్లా విదేశాంగ మంత్రి డాక్టర్ ఖలిలుర్ రహ్మాన్ భారత పర్యటనకు రానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు క్రికెట్ సహకారంపైనా చర్చించే అవకాశం ఉంది.


Eenadu Telugu 27 days ago
Home Flash News