అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
అమరావతి: రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాముల 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల్లో నిర్మిస్తున్న స్మృతివనంలో అమరజీవి 125వ జయంతి వేడుకలను భారీస్థాయిలో నిర్వహించడానికి ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.