జియో ఓటీటీ పాస్: కేవలం రూ.200కే 15 OTT యాప్స్, అపరిమిత 5G
భారతీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రిలయన్స్ జియో మరో మైండ్ బ్లోయింగ్ ఆఫర్తో మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఎంటర్టైన్మెంట్ ప్రియులకు పండుగలాంటి వార్త అందిస్తూ.. కేవలం రూ.200 ధరతో ఒకే ప్యాక్లో ఏకంగా 15 ప్రీమియం ఓటీటీ యాప్స్ యాక్సెస్ ఇచ్చే ‘జియో OTT పాస్’ను బుధవారం, మే 27న విడుదల చేసింది. ఈ ఒక్క రీఛార్జ్తో నెలకు సుమారు రూ.15వందలు విలువైన ప్రయోజనాలను కేవలం రూ.200లకే యూజర్లు పొందొచ్చు. 28 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ పాస్ ద్వారా వీడియో స్ట్రీమింగ్, లైవ్ టెలివిజన్, హై-స్పీడ్ డేటాను ఒకే ప్యాకేజీలో జియో అదరగొట్టింది.