టీటీడీ ధర్మకర్తలమండలి సమావేశం.. అక్షర గోవిందం.. అలిపిరి దగ్గర శాశ్వత యాగశాల నిర్మాణం
తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. నిబంధనలకు అనుగుణంగా ధూప, దీప, నైవేద్యాలకు రూ. 5 వేల నుండి రూ.10 వేలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే త్వరలో ..అక్షర గోవిందం.. కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలిపిరి దగ్గర శాశ్వత యాగశాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాన్నరు. విద్య, వైద్య సేవల విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర, బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి.వీరబ్రహ్మం, సివిఎస్ఓ కే.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.