Himanta Biswa Sarma: అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ రాజీనామా.. 11వ తేదీ తర్వాతే మళ్లీ ప్రమాణం
గౌహతి: అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Himanta Biswa Sarma) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. తన క్యాబినెట్ మిత్రులతో సహా ఆయన తన రాజీనామాను గవర్నర్ లక్ష్మణాచార్యకు సమర్పించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 102 సీట్లతో విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఆయన రాజీనామా సమర్పించారు. మే 11వ తేదీ తర్వాతే ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని హిమంత శర్మ పేర్కొన్నారు. 126 స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరిగాయి.
బిశ్వశర్మ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు సీఎంవో కార్యాలయం తన ఎక్స్లో పోస్టు చేసింది. అయితా తాత్కాలిక సీఎంగా కొనసాగమని హిమంతను గవర్నర్ కోరినట్లు తెలిసింది. లోక్భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారోత్సవం మే 11వ తేదీ తర్వాత ఉంటుందన్నారు. తమ పార్టీ చరిత్రాత్మక విజయం సాధించిందని, ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించామని బిశ్వశర్మ తెలిపారు. బీజేపీ శాసనసభా పక్షం కొత్త సీఎంను ఎన్నుకుంటుందని ఆయన అన్నారు.