ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీ: వాహనదారులకు బంపర్ ఆఫర్.. కొత్త నిబంధనలు ఇవే!
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్తగా 'ఈవీ పాలసీ 2026-2030' ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీ రాయితీలు ఇవ్వనుంది. ఇప్పుడు మీరు కొనే ఎలక్ట్రిక్ కార్ ధర రూ. 30 లక్షల లోపు ఉంటే, దానికి ఎలాంటి రోడ్ టాక్స్ (Road Tax), రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది మార్చి 31, 2030 వరకు వర్తిస్తుంది. పెట్రోల్, బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ కార్లకు రోడ్ టాక్స్లో 50% రాయితీ ఉంటుంది. అయితే రూ. 30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ కార్లకు ఈ రాయితీలు వర్తించవు.