Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు
తిరుమల : తిరుమల ( Tirumala) లో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్టుమెంట్లు ( Compartments ) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. బుధవారం స్వామివారిని 72,017 మంది భక్తులు దర్శించుకోగా 26,863 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.4.17 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.