శ్రీరామ నవమి శోభాయాత్ర..డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా.. 3 వేల మంది పోలీసుల బందోబస్తు
శ్రీరామనవమి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ సూచించారు. శోభాయాత్రకు 3 వేల మంది పోలీస్ బందోబస్త్, డ్రోన్లు,సీసీ కెమెరాల నిఘాతో పరిశీలిస్తామని చెప్పారు సజ్జనార్.
శ్రీరామనవమి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ సూచించారు. శోభాయాత్రకు 3 వేల మంది పోలీస్ బందోబస్త్, డ్రోన్లు,సీసీ కెమెరాల నిఘాతో పరిశీలిస్తామని చెప్పారు సజ్జనార్.
శోభాయాత్రకు పిక్ మార్కెటింగ్, చైన్ స్నాచింగ్ జరగకుండా క్రైమ్ టీమ్లను షీ టీం లను మోహరిస్తామని చెప్పారు సజ్జనార్ . శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లతో పర్యవేక్షిస్తామని చెప్పారు. శోభాయాత్ర సాగే మార్గాలు సీసీ టీవీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గత ఏడాది వెహికల్ బ్రేక్ డౌన్ వల్ల శోభాయాత్ర నెమ్మదించింది కానీ.. ఈ సారి అలాంటి సమస్యలు లేకుండా శోభాయాత్రను అనుకున్న సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సీపీ సజ్జనార్