ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల
హైదరాబాద్: రైతు భరోసా మొదటి విడత నిధులను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22న విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించి సీఎం నిర్ణయం తీసుకున్నారు. తొలివిడతగా ఒక ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. దీని కోసం రూ.3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2,650కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రూ.9 వేల కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.