తెలంగాణలో జనాభా లెక్కలు.. రేపటి(ఏప్రిల్ 26) నుంచి ఆన్ లైన్ సెన్సెస్
తెలంగాణలో తొలిసారి జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్దమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల షెడ్యూల్ ను ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి. జనగణన మొత్తం రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో ఆన్ లైన్ లో డిటెయిల్స్ నమోదు(సెల్ఫ్ ఎన్యూమరేషన్), ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరణలో భాగంగా బడి,గుడి,ఆస్పత్రి,గుడిసె , అద్దె ఇల్లు ఇలా ఇండ్ల గణన, రెండో దశలో వ్యక్తిగత సమాచారం సేకరించనున్నారు.
మొదటి దశ జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 26, 2026 నుంచి మే 9 వరకు సొంతంగా ఆన్ లైన్ లో డీటెయిల్స్ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఉంటుంది. ఆ తర్వాత మే 11నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. తుదిదశలో ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన జరుగునుంది. మన వివరాలు చెప్పేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు.
మొదటి దశ జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 26, 2026 నుంచి మే 9 వరకు సొంతంగా ఆన్ లైన్ లో డీటెయిల్స్ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఉంటుంది. ఆ తర్వాత మే 11నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. తుదిదశలో ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన జరుగునుంది. మన వివరాలు చెప్పేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు.